పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

85

నీప్రమథ సురనికాయంబును స్థావర జంగమాత్మకంబగు నీ విశ్వంబంతయు
శ్రీకరజాలంబని భవదనుగ్రహంబున నిట్లు చిరసమాధి నిష్టుండనై కంటిఁ
గాని మదన్యుం డెవ్వం డిట్లు తెలియనేర్చు నేనును భవత్ప్రసాదంబునన
కంటిని. భవత్ప్రసాదంబును గురూపదేశంబును కర్మ సామ్యంబును గల
వారలు జన్మంబునందే యిట్లు పరమానుభవంబు నెఱింగి ముక్తులగుదురని
యెఱుంగక కదా వివిధమత ప్రవిష్టులై చెడువాదంబులు సేయుచు బరస్పర
వంచకులై ప్రవర్తింపుచుందురు. వారలైనను గామక్రోధ రహితులై
స్వమతాచార నిష్ఠులై న్వేష్ట దేవతాభక్తి గలిగి యితర దేవతా మత
దూషణంబు లేక ప్రవర్తించిరేని జన్మాంతరంబున దత్తదేవతానుగ్రహంబున
గురూపదేశంబుఁ బొంది యిట్టి పరమానుభవంబునం జేసి ముక్తిఁ గాంతు
రేనును గృతార్డుండనైతి ననుగ్రహింపవే యని విధాత మఱియు నిట్లనియె.

హరిహరాభిఖ్య దివ్య కూటాగ్రములను
లింగమై యుండినట్టుల లింగమగుచు
నాదు శిఖరంబునందున నాథ ! నీవు
నిలువఁగోరితి నీపూజ నేను జేతు.217

అను వనజ గర్భు పలుకులు.
విని కోటీశుండు కరుణ విధి కిట్లనియెగా
విను నూతన కోటీశ్వరుఁ
డనఁగా లింగ స్వరూపమై విలసిలుదున్ .218



అని చెప్ని కోటీశ్వరుం డచ్చోట నూతన కోటీశ్వరుఁడై విరాజిల్లినది
మొదలుగా విధాత యీ లింగంబు నర్చింపుచుండు నిట్లు కూటత్రయంబు
నందు కోటీశ్వర పాపనాశన నూత్న కోటీశ్వర దివ్య లింగంబులు రుద్ర
విష్ణువిధాతలు సేవింపుచుందు రీ లింగంబులు మానవుల కగోచరంబులగుట
నీ స్థలంబుల శిలారచిత లింగంబులఁ బ్రతిష్ఠించి జనంబులు భక్తియుక్తం
బూజించి భుక్తిముక్తు లనాయాసంబుగాఁ గాంతురని శివుం డుమాదేవికిఁ