పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ఒకవేళ ఈ శ్లోకము పఠించినను బ్రాహ్మణకర్త బ్రాహ్మణ భోక్త ఏర్పనప్పుడు విపతీర్ధ మహిమను గొనియాడుకొనుట కుదాహరణముగా జెప్పుకౌసిన తప్పులేదు.

3. "ఓషధయ:సంవదంతే సోమేనసహరాజ్ఞాయస్మై
కరోతిబ్రాహ్మణఃతగ్ం-రాజన్ పారయామసి|

ఈ మంత్రము ఆవాహనానంతరము అక్షతలు భోక్తలమీద జల్లునప్పుడు వచ్చును. ఇందులోని బ్రాహ్మణపదము కర్తకర్థము గాని భోక్తకు సంబంధించదు.

దీనియర్ధ మేమనగా

సోముడనేరాజుతో ఓషధులు జెప్పుచున్నవి.

ఓరాజా ఏ ఫలము కొరకు బ్రాహ్మణుడు కర్మను చేయుచున్నాడో దానిని మేము తుదముట్టించుచున్నారము.

ఈ మంత్రము వలన భోక్తలు క్షత్రియ వైశ్యులుగా నున్నపు డేయసందర్భమును లేదు.

4. ఇయంభూర్గయా ఏతేబ్రాహ్మణాగదాధరాః అనుచోటను"దేవతేదమన్నం కవ్యం బ్రాహ్మణ స్త్వాహవనీయార్ధే దత్తం అను చోటను దక్షిణేన బ్రాహ్మణంస్మృశస్ అనుచోటను ఉదాహరణములుగా బ్రాహ్మణ పదములు చెప్పబడినవి.

శ్రీనివాసశర్మా అనియు శ్రీనివాసశర్మణం ఆనియు ఉదాహరణములుగా జెప్పినంత మాత్రముచేత అవే మంత్రములు కావు. గోవిందశర్మా అనవచ్చును రామవర్మా అనవచ్చును.అప్పుడు భోక్తలుగా గూర్చుండువారెవ్వరో అదిచూచి మార్చుకొనవచ్చును.