పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

యెంతకాలము మనదేశమువారు ప్రవర్తింతురో అంతవరకు బ్రాహ్మణులు క్షత్రియవైశ్యుల యిండ్లవారుచేసిన పాకమును భుజించరనుట విదితమే. బ్రాహ్మణుడే ముఖ్యకల్పభోక్తగావునను క్షత్రియవైశ్యులకు బ్రాహ్మణభోక్త దొరకడు గావునను అనుకల్పభోక్తలగు స్వబంధువులే భోక్తలు కావలసి వచ్చినది.

పక్వాన్నే రాడ్విశోర్ముఖ్య-కల్పాలాభస్తు సాంప్రతం |
వివృతో దాసుపంబ్ధిశశినా రామశర్మణా॥

ముఖ్యకల్పాలాభవిచారము - సమాప్తము

శ్లో.ఓమ్ సర్వం ఖల్విదం బ్రహ్మ-తద్భిన్నింతునవిద్యతే!
ఆత్మజ్ఞానేనలోకార్థం- నారాయణము పాస్మహే ||

4. శ్రాద్ధేషుక్షత్రియవైశ్యోరనుకల్పభోస్తుణాం మంత్రానుకూలతా విచారఘట్టము

-: స్వసిద్ధాంతములు :-

  • పునంతుమాం బ్రాహ్మణ పాద పాంసపః" అనునదియు *రక్షంతుమాం బ్రాహ్మణ పాద పాంసపః" అనునదియు "వివ్రశ్రీపాద పంకజః" అనునదియు విప్రౌఘదర్శనాస్సద్యః అనునదియు “యావతీర్వై దేవతాస్తాస్సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాద్బాహ్మణేభ్యో వేదవిద్భ్యోది వేది వేనమస్కుర్యాత్" అనునదియు, భోక్తృవిషయములు కావు. పరిషద్వందనముతో సంబంధించినవి పరిషత్తు అనగా నొకనికి ప్రాయశ్చిత్తము జరిగించుట కేర్పడిన బ్రాహ్మణసభ.