పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

ఆరభేత నవైః పాత్రై రన్నారంభం స్వబాంధవైః

దీనవలన స్పష్టముగా శ్రాద్ధాన్నము బంధువులే వండవలసినట్లు కానవచ్చుచున్నది.

2. ఈ యుగంబు సజాతీయులే స్వబంధువులగుదురు. ఎందుచేతననగా విజాతీయ వివాహములు వర్ణింపబడినందున

అందుకు బ్రమాణములు.

వృద్ధపరాశరము

ద్విజానా మసవర్ణాసు కన్యాసూపయమ స్తధా
అసవర్ణవివాహములు కలియుగమున వర్ణింపబడినవి.

3. శుచివ్రతులైన క్షత్రియ వైశ్యుల యన్నమును బ్రాహ్మణులు భుజించుట శాస్త్రమువలన నిషేధింపక పోయినను ఇప్పటి బాహ్మణులు కొన్ని కారణములచేత భుజింపనొల్లకున్నారు. గాని బ్రాహ్మణభోక్త క్షత్రియ వైశ్యులకు లభించడు ఇందునకు

పరాశరస్మృతి ప్రాయశ్చిత్త కాండము 11వ అధ్యాయము
1. వ శోకము

క్షత్రీయశ్చాపి వైశ్యశ్చ క్రియావంతౌశుచివతౌ
తద్గృహేషు ద్విజై ర్భోజ్యో హవ్యక వ్యేషు నిత్యశః

హవ్యకవ్యములయందు శుచిప్రతులైన క్షత్రియ వైశ్యుల యిండ్లలో బ్రాహ్మణులు భోజనము చేయదగినది. యిట్ల నేక ప్రమాణములుకలవు. కాని దురాచారములను ఆచారములను కొని