ఈ పుట అచ్చుదిద్దబడ్డది
18
అనిన నవనాథుండు నేత్రరోగంబుల కుపాయంబడిగిన నాదినాథుండు
| ఆ.వె. | భృంగరాజ రసము పొలుపొందగా దీసి | |
పిప్పళ్ళను తుమ్మియాకు రసముతోను గుంటగలగరాకు రసముతోను చక్కగా కాటుకవలె జేసి కన్నులకు పెట్టిన దుర్మాంస దోషములడగిపోవును.
| ఆ.వె. | కలగరాకు రసము గారవంబునతీసి | |
గారపండు జిగట తెచ్చి గుంటగలగరాకురసముతో బాగుగా నూరి కన్నులకు బెట్టిన యెడల కన్ను అదురుట మిటమిటలాడుట మానును. ఒక నెలరోజులు బెట్టిన పూలు కూడా మానును.
| సీ | భృంగరాజరసంబు సంగతం బొనరించి | |