Jump to content

పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

మేహవాయువుతో గూడిన శూలలకు

తే.గీ.

ఆరతులము కట్కరోహిణి సరగసూరి
మిరియముల చూర్ణమును దానమెళగించి
నాల్గుతులముల పసరులో నల్ని కల్పి
రోగికిచ్చిన శూలలు డాగిపోవె

అరతులము కటుకరోహిణి అంతే మిరియాల చూర్ణముతో కలిపి నాల్గుతులముల గుంటగలగర పసరులో బాగుగా గలిపి పుచ్చుకొన్న యెడల శూలలు హరించును.

తే.గీ.

భృంగరాజపు కొనలను సంగతముగ
తురగసంఖ్యను గొనితెచ్చి పరగజేర్పి
యేడు మిరియాలతో మూడునాడులు దిన
చురుకు రోగంబులు దొలగి సుఖమునిచ్చు

గుంటగలగరాకులు ఏడుకొనలతోనున్నవి,మిరియాలు ఏడు కల్పి సేవించిన యెడల చురుకు సెగలు మానును.

తే.గీ.

ఏడుదినములు సేవింపనెల్ల గతుల
పొక్కులు సవాయి చచ్చును మిక్కిలిగను
గ్రచ్బు జేసెడి రోగముల్ కదలి పోవు
ననుచు సిద్ధుండు వచియించే నద్భుతముగ

పై పద్యములో చెప్పినమందును 7 రోజులు పుచ్చుకొనిన యెడల పొక్కు సవాయి, చచ్చు మొదలగు చెడు రోగములు మానును.