పుట:శృంగారశాకుంతలము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

69

     నంగసంభవుఁ డను నతినిర్దయునిచేత,
                    దర్పకుం డను నాకతాయిచేతఁ,
తే. జెడ్డవారలఁ గథలుగాఁ జెప్పనేల,
     వేల్పుఱేఁ డంప నొకదేవవేశ్యఁ జూచి
     తొడరి యజునైన నొసలివ్రా ల్దుడువ నోపు,
     కౌశికునియంతవాఁ డూడ్చెఁ గచ్చడంబు.143
క. ఈగతి వేలుపురై యెల
     నాగను దగులుకొని నాఁడునాటికిఁ గోర్కు
     ల్తీఁగలు సాగఁగ మన్మథ
     భోగంబుల మనసు తృప్తిఁబొందిన పిదపన్.144
క. ఆళీమిళదమరీగత
     కేళీవనపవనచలితకేసరధూళీ
     పాళీముహురసుగతభృం
     గాళీగణ్యంబు హిమనగారణ్యంబున్.145
వ. ప్రవేశించి యచ్చటఁ దపంబునకు నిలిచె, మేనకయు నమ్మునిసంగంబున
     నొక్కకూఁతురుం గని యప్పు డటుపుట్టిన యప్పురుటిపట్టి నల్లనల్లన పట్టు
     కొనిపోయి మాలినీనదిసైకతంబున నేకతంబున బద్మపత్రంబులు పొత్తు
     లుగా నమర్చి మెత్తమెత్తన యునిచి దివంబున కరిగె నిచ్చట.146
క. అత్తటిని శకుంతంబులు
     తత్తనువున కెండ గాలి దాఁకక యుండ
     న్మెత్తనియీకలఁ బొదుపుచు
     నెత్తురుగందుపయి నిల్పె నెయ్యముఁ గృపయున్.147
ఉ. ఆనది నొక్కనాఁడు ముదమారఁగ శిష్యులుఁ దానుఁ గూడి వి
     జ్ఞానరసుండు పుణ్యనిధి సాధువరేణ్యుఁడు, కాశ్యపుం డను
     ష్ఠానము సేయ నేగి యచటం బొడఁగాంచె శకుంతపక్షర
     క్షానిరుపద్రవస్థితిఁ బొసంగిన కౌశికవీర్యసంభవన్.148