పుట:శృంగారనైషధము (1951).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

ఇచ్చట "వైశాఖవేళ” యన్న దెంతసందర్భశుద్ధిగలదో రసికు లరయుదురుగదా?

ఔచిత్యసంపాదనముకై చేసినమార్పుల నటుండనిచ్చి మొత్తముమీఁద భాషాంతరీకరణపద్దతిఁ జూచినచో శ్రీనాథుఁ డన్నట్లు నిజముగా నిది "భావం బుపలక్షించియు, రసంబు పోషించియు, నలంకారంబు భూషించియు, నౌచిత్యంబాపాదించియు, ననౌచిత్యంబు పరిహరించియు మాతృ కానుసారంబునఁ” జెప్పఁబడినదేయని స్పష్టమగును. ఇట “భావం బుపలక్షించి” యనఁగా మూలకారునియభిప్రాయము గుఱుతించి యనియర్థము చెప్పవలసియుండును. కొన్ని చోట్ల నాతనియాశయములు స్పష్టముగా లేనప్పుడు ఆంధ్రకవి వానిని చక్కగా నుపలక్షించి స్పష్టపఱిచినాఁడు.

శ్లో. విధిం నధూసృష్టిమపృచ్ఛమేవ తద్యానయుగ్యో నలకేళియోగ్యాం,
    త్వన్నామవర్ణా ఇవ కర్జసీతా మయాస్య సంక్రీడతి చక్రచక్రే.

చ. అడిగితినొక్కనాఁడు కమలాసనుతేరికి వాహనంబనై
    నడుచుచు నుర్విలో నిషధనాథునకెవ్వతెయొక్కొ భార్య య
    య్యెడు నని చక్రఘోషమున నించుక యించుకగాని యంత యే
    ర్పడ విననైతి నీ వనుచుఁ బల్కినచందము దోఁచె మాలినీ.

ఎంత మూలము ననుసరించినను మూలమునకు నితఁడు వన్నె పెట్టుట మానలేదు.

సీ. నలినసంభవు సాహిణము వారువంబులు కులముసాములు మాకుఁగువలయాక్షి
    చదలేటిబంగారు జలరుహంబులతూండ్లు భోజనంబులు మాకుఁబువ్వుఁబోఁడి
    సత్యలోకముదాఁక సకలలోకంబులు నాటపట్టులు మాకు నబ్జవదన
    మధురాక్షరములైనమామాటలువినంగ నమృతాంధసులె యోగ్యులనుపమాంగి