పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 461

వచ్చినప్రేమ నన్బిలువనంపుట కెద్ది గతంబు తెల్పవే
మచ్చిక నన్న యానృపకుమారుకు డత్యనురాగవైఖరిన్. 344

వ. ఆప్పు డయ్యప్రతిమప్రభావంబుగల లీలాశుకంబునకు సకలవివిధోపచారంబుల సమంచితోపమకుటసబహుమానంబుగా యతని సాక్షాద్దైవమని మనంబున భావించి ప్రదక్షిణప్రణామసంభావనపూర్వకంబుగా మృదుమధురగంభీరభాషణంబుల నిట్లనియె. 345

ఉ. కామకళాశుభాకరశుకప్రవరున్ గనుగొంటి నేడు నా
బాములు వీడుకొంటి నను ప్రాఙ్ముఖుఁ జేయదలంచికొంటి నా
స్వామియు నీవెకా మఱి కృతార్థుఁడ నీదుసుబుద్ధి వింటె నిం
కేమి యొనర్తు దెల్పగదవే యన కీరవరేణ్యుఁ డిట్లనున్. 346

క. వామాక్షీజనమోహన
కామాంధుం డైనయతనికథ విను మును సు
త్రామముఖు లనుభవించిన
బాముల మది దెలియు మోనృపాలకతిలకా! 347

సీ. కాకుస్థకులుఁడవై కలనృపుల్ నినుగొల్వ
మఖుఁ డేజగద్ధితమహిమ నొందె
పడరాని యిడుముల బడియు బొంకు నెఱుంగ
కలహరిశ్చంద్రుండు నలసి యలసి
యల్ల విశ్వామిత్రు డతిబన్నములవెట్ట
రాజమార్తాండుఁడై గ్రాలెగాదె