పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 377


నెచటనుండిన నింట నేమనువారులే
     కింపుపొంపు ఘటిల్లు నిల్లుగలిగె
రేలువగల్పట్టి పాలార్పకొకవేళ
     తగ వెంచి చనుదెంచు మగఁడు గలిగె
వలసినయట్టు లవ్వారిగా సారక
     స్తూరికాముఖ్యవస్తువులు గలిగె


తే.

నెన్ని గలిగిన నేమి నాయిచ్చలోని
యాస గడతేఱ జారవిహారసుఖము
సంభవించ దటంచుఁ గాంక్షావిశేష
పరవశస్వాంత యగుచుఁ బాపంబుఁ జెంద.

600


మ.

ఒకనాఁ డాత్మనిశాంతసౌధలసమానోద్యానవీక్షాసము
త్సుకయై పోయి తదంతరంబున మణిస్తోమాతిథామాతిరం
జకమై యుప్పరమంటు చప్పరమున న్సౌవర్ణడోలావిలో
లకుఁడై నిల్చిన యొక్కసిద్ధుఁ గని చాల న్విస్మయం బందుచున్.

601


క.

జారవిహారంబునకే
కారెడు నాకోర్కిఁ దీర్పఁగా వచ్చిన య
మ్మారుఁడె యితఁడని యచ్చెలి
చేరం జని చూపువలపు చేఁతలఁ దెలుపన్.

602


క.

నిలిచిన నతఁడా సతికిం
గలకోర్కి యెఱింగి మమ్ముఁ గామింపకుమీ
యిలచూడఁగవచ్చిన సి
ద్ధుల మతనునితూపు మనసుఁ దూఱదు మాకున్.

603


ఉ.

ఇందు మనోహరంబయిన యివ్వనవాటిక చూచినప్పుడే
డెందము మమ్ము నిల్ప నిట డిగ్గితి మిప్పుడ పోవలెం జిదా