పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378 శుకసప్తతి


నందవిభూతిగల్గ లలనాజనసంగమసౌఖ్య మేల ర
మ్మిందునిభాస్య నీమది యభీష్టము సేకుఱునట్లు చేసెదన్.

604


క.

అని చేరఁబిలిచి కర్ణం
బున నొకమంత్రంబు నుడివి పూఁబోఁడి మనం
బున నీది జపింపు మింక గ
గనగమనము గల్గు నీదుకాంక్షలు తీరున్.

605


చ.

అని కరుణించి సిద్ధుఁడు వియత్పథజాంఘికుఁ డైన మెచ్చి య
వ్వనిత విభాకరుం డపరవార్ధిఁ బడ న్మణిమంజరీగృహం
బునకు నిజేశ్వరుం డరుగుపూఁట యటంచును నిశ్చయించి య
మ్మనువు జపించి విష్ణుపదమార్గమునం జనియె న్రయంబునన్.

606


క.

చని తత్కాళీగేహం
బున నొకమగనాలికూటమునకై కనుగూ
ర్కనియొక్కజారుతో నిం
పునఁ బొదలుచు నుత్తరంపుమూల రమించెన్.

607


తే.

అనుదినము వేళయైనప్పు డవ్వధూటి
యటకుఁ దా వచ్చునట్లుగా నతఁడు వచ్చు
నట్లుగాఁ జేసి యట్టుల నతనిపొందు
విడువఁజాలక మెలఁగెఁ బూవిలుతునాజ్ఞ.

608


చ.

మనుజకులేంద్ర యంత నభిమానధనుం డొకనాఁటిరేయిఁ గాం
చనరుచివారము ల్గలహజారమునం గొలువున్కిఁ జేసి య
వ్వనితలు నల్వురు న్మునుపు వచ్చుక్రమంబున వచ్చి కాళికా
ఘనగృహసీమఁ జేరి రతిఁ గాంచుచునుండిరి నాల్గుమూలలన్.

609


క.

అంతట నభిమానధనుం
డాంతరమునఁ గాళికాపదాంబుజసేవా