పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

376 శుకసప్తతి


తే.

అతఁడు దానును గాళిగేహంబులోన
దక్షిణపుమూల రతికేళిఁ దనివినొంది
యనుదినము నాతఁ డటువచ్చునట్లు చేసి
పోయి యాలీల మెలఁగె సప్పొలఁతి మఱియు.

594


మ.

అని రాజన్యున కయ్యమాత్యసుత నిత్యప్రౌఢవాగ్రూఢిఁ దె
ల్పెనటంచున్ శుకరాజు పల్కునెడ నాళికాప్తభానుప్రభల్
దనర న్వైశ్యవధూటి యంత రనిశాంతం బొంది యారాత్రి య
మ్మనుజేంద్రాత్మజుపొందుఁ జెందఁ జనుప్రేమ న్ముంగల న్నిల్చినన్.

595


క.

కని చిలుక నేఁట మాత్రమె
విను మమ్మంత్రిసుత భూమివిభుతో మును జె
ప్పినకథ ఱేపటికిఁ గథల్
వినిపించిన నరఁటిపండ్ల వేయుము చెలియా.

596


వ.

అనినవ్వించి యాజవ్వనితో నవ్విహంగమపుంగవం బిట్లనియె.

597


క.

అంత నలవిక్రమార్కు డ
నంతరకథ యడుగ మంత్రినందన నవవా
నంతసమయప్రమోదా
క్రాంతవికస్వరపికస్వరంబునఁ బలికెన్.

598


తే.

మానవాధీశ యయ్యభిమానధనుని
నాలుగవకొమ్మ కమ్మకుందనపుబొమ్మ
యైన మకరంద యిచ్ఛావిహార మంద
సందు గానక మందచంచలతఁ జెంది.

599


సీ.

నిలనీని వంటవార్పుల నత్తమామల
     పోరును లేని కాఁపురము గలిగె