పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 375


చ.

అని నిజభార్య చేసిన యపాయమునం దనకట్లు సంభవిం
చిన యశరీరితాస్థితులు చెప్పి యిఁకం జఠరానలంబుచే
తను నెరియం దొడంగె వనితా యిపుడన్నము వెట్టితేని నీ
పనిచిన పంపుఁ జేసెద శుభంబగు నీకని మ్రొక్కి వేఁడినన్.

588


క.

అమ్మగువ చపలఁ గూరిచి
యమ్మా భువినాఁటదాన వైన న్నీచే
యమ్మహితసాహసము నా
కిమ్మా నాకోర్కు లెల్ల నీడేఱుటకున్.

589


క.

అని మెచ్చి క్రూరునిం గనుఁ
గొని వాహన మగుచు నన్నుఁ గొని చనఁగలవా
మనమునఁ దలఁచినచోటికి
దినదినము న్నీకు మంచితిండి ఘటింతున్.

590


తే.

అనిన నిను మోచికొనుట భాగ్యంబుగాదె
బ్రతికితినటంచు వాఁ డొడఁబడినఁ జూచి
యబల బోనంబు వాని కాహార మిచ్చి
తోయజానన యద్దమరేయివేళ.

591


క.

పతి మకరందాగృహసం
గతిఁ గాంచుట దెలిసి గగనగమనక్రూరో
ద్ధతవాహనయై విజన
క్షితి దలఁచుటఁ జనియె కాళిగేహము చేరన్.

592


క.

చని వాహనంబు డిగి య
వ్వనితామణి పథికుఁడైన వైశ్యుని నొకనిం
గని తనవర్తన మంతయు
వినిపించి తదీయకథలు విని మోదమునన్.

593