పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

366 శుకసప్తతి


వేదవేదాంతవిద్బ్రహ్మవేతృగరిమ
నితని కెన లేదనఁగ వార్త కెక్కి వెలయు.

544


తే.

త్రిషవణస్నానములు నిష్టదేవపూజ
గ్రంథపారాయణముఁ బరబ్రహ్మచింత
భైక్షభుక్తిహరీతకీభక్షణంబు
నజినశయనంబుఁ గల్గి యయ్యతి వొసంగు.

545


క.

ఆసమయంబున భృగుఁడను
భూసురుఁ డొకఁ డొక్కకార్యమునకై తమితో
నాసన్న్యాసికి నంతే
వాసిత్వము మెఱయఁగా ధ్రువంబున మెలఁగున్.

546


సీ.

ముదముతో యతికన్న మున్న మేల్కని గోమ
    యంబున మఠ మెల్ల నలికివైచు
దపసి యేటికిఁ బోవుతఱి నంటి వెంటనె
    నడచు నాతనికమండలువుఁ దాల్చి
సన్న్యాసి దేవపూజకుఁ బూనుచో నుప
    కరణము ల్దొలిచి శీఘ్రమున నొసఁగు
సంయమీశ్వరుఁడు భిక్షకుఁ బోవునెడ గోచి
    యును నార్ద్రపటఖండ మొనరఁదాల్చుఁ


తే.

బారికాంక్షికి నజినంబుఁ బఱచి రాత్రి
పరమశుద్ధాంతరంగుఁడై పదము లొత్తు
నెలమి యమ్మౌనికలలోనఁ బిలిచె నేని
స్వామి పనియేమి యనుచు హస్తములు మొగుచు.

547


క.

ఈరీతి నుండ నాతని
మేరకు నొకనాఁడు మిగుల మెచ్చి యతీంద్రుం