పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 365


బనఁజను కాళికాగృహగుహాంతరభాగముఁ జేరి చీఁకటుల్
పెనఁగొనఁ దూర్పుమూల రతిలీలలఁ జారుని గూడి వేడుకన్.

538


క.

బిలమార్గంబునఁ గ్రమ్మఱ
నిలయము సేరంగఁ జని ఘనీకృతమోహా
కుల మొరు లెఱుఁగనికైవడి
నలచోరుని విడక యాలతాంగి మెలంగెన్.

539


క.

అని యాబాలసరస్వతి
జనపతికిం దెలిపె నని రసస్థితి మిగులం
గనఁబడఁ గీరము నొడువఁగ
దినకరునిరథంబు తూర్పుదిక్తటి దోఁచెన్.

540


క.

అంతఁ బ్రభావతి తనయ
భ్యంతరమందిరముఁ జెంది యారేయి ధరా
కాంతుని జేరుట కాత్మో
పాంతమునం గులుకఁ జిలుక యల్లనఁ బలుకున్.

541


క.

వినవమ్మ విక్రమార్కుం
డనుపమవిస్మయముఁ జెంది యవ్వలికథ యే
యనువున నడ నొ చెపుమా
యన సచివునితనయ సవినయంబుగఁ బలికెన్.

542


తే.

మహిప యంతట నయ్యభిమానధనుని
రెండవసుపాణి మకునికూరిమి పటాణి
మంజువాణి మనోవ్యథ మగకఱవునఁ
బడినగతినుండఁ దత్పురప్రాంతసీమ.

543


తే.

ఏటిదరి నొక్కసన్న్యాసి యింపునింపు
మఠము గావించుకొని శాస్త్రమంత్ర తంత్ర