పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 367


డోరీ యలరితి నిచ్చెద
గారవమున నడుగు మేమి కావలె ననినన్.

548


తే.

ఆతఁడు ప్రణమిల్లి పల్కు సంయమివరేణ్య
విన్నప మొనర్ప వెఱతు నావెఱ్ఱితనము
ముద్దుగాఁ జూచు కరుణాసముద్రమూర్తి
వగుటఁ దెల్పెద నాకోర్కి యాదరింపు.

549


ఉ.

మాపొరుగింటి శూద్రుని కుమారిక పిన్నటనాఁటనుండియు
న్నాపయిఁ బ్రేమఁగన్నది యనంతర మొక్కఁడు పెండ్లియాడి వాఁ
డీపురిలోన నిల్వెడలనీక పరుం డటు సేరకుండ సం
జ్ఞాపరుఁ డౌచు దాని ననిశంబును నేలెఁడు సంయమీశ్వరా.

550


సీ.

ఉదుటుతో నారాక కెదురుచూచుచు ముద్దు
    గాఱఁగా నది నిల్చుకడపఁ జూచి
ననుఁ జూడఁగోరి క్రొన్ననతీవనడియాడు
    విధమున నది కుల్కు వీథిఁ జూచి
నీటికై వచ్చుట నెపముగ నాతోడఁ
    బలుకుచు నది చెందు బాళిఁ జూచి
తమవారి మొఱఁగి తత్తరము హత్తగ వచ్చి
    యది నన్ను గలయు పూఁబొదలఁ జూచి


తే.

యేను భరియింపలేక మీకృప సమాశ్ర
యించి యున్నాఁడ నన్ను నీ డేర్పవయ్య
యార్తరక్షణ మఖిలపుణ్యముగదయ్య
కూర్మి నెటులైన నను దానిఁ గూర్పవయ్య.

551


తే.

అనినఁ జిఱునవ్వు నవ్వి యయ్యతికు లేంద్రుఁ
డౌర మన్మథు నిజమాయకడ్డ మెవ్వ