పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

356 శుకసప్తతి

కాని ప్రాణేశు పరిచర్య కానివావి
యయ్యె నేమందునయ్య యయ్యతనుమహిమ. 495

సీ. ఠీవితో నేటినీటికిఁ బోవుచో వెంట
వెంటవచ్చితిఁజుమా విద్రుమోష్ఠి
పొరుగింటి చెలిఁ గూడి సరసము ల్పలుకుచో
జెంత నిల్చితిఁజుమా దంతిగమన
ముంగిట జననితో ముచ్చటలాడంగ
నిక్కిచూచితిఁజుమా టెక్కులాఁడి
పడుకటింటికిఁ జెలు ల్ప్రార్థించి యనుపుచోఁ
దలుపుమీటితిఁజుమా తతనితంబ
తే. యనుచు నారాధ్యుఁ డొంటిపాటైన వేళ
నవ్వధూమణితోడ మోహంబుఁ దెలుప
నప్పడంతియు నవి నీవు చెప్ప నేల
వినర నాకన్ను లెందున్న వనుచుఁ బలుకు. 496

క. ఈరీతి నుండు నంతట
వారల యందములు సవసవలుగా వినియ
య్యూరెల్ల గుజగుజలఁబో
జారునితోఁ జపల తెలుపుఁ జాంచల్యముగాన్. 497

క. వచ్చెఁగద బెడఁద మన కిఁక
నిచ్చట నడయాడఁ గూడ దెటకేనియు నే
వచ్చెద రమ్మటులైన
న్విచ్చలవిడి నడువవచ్చు వెఱువకు మదిలోన్. 498

తే. అనిన భయమంది యాతఁ డోయబల యింత
సాహసక్రియ చేయంగఁ జనునె మనకు