పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 355

మునుదాని తెఱఁ గెఱుంగుట
నెనసినతమి సురతకేళి నింపుఘటింపన్. 491

క. ఆవెనుక మగఁడు గాఁడని
భావంబునఁ దెలిసి సిగ్గువడి యంతటిలో
దైవాధీనం బిది యని
భావించుచుఁ జపల మృదులభాషల ననియెన్. 492

తే. ఇంత మోసంబుఁ జేసి నాయీలువెల్ల
నపహరించితి విఁక నేమి యైనకార్య
మయ్యెనేకద యీరీతి ననుదినంబు
నన్ను మన్నింపుకున్నఁ బ్రాణములు విడుతు. 493

క. అని పలికె నదియు మొదలుగ
వెనుదీయక యజ్జయైన వేళల నెల్లం
జనుదెంచు వానిరతి న
వ్వనితామణి తనివిలేక వర్తిలఁ దొడఁగెన్. 494

సీ. భర్తకుఁ భ్రాతరౌపాసనాగ్ని యొసంగి
దుడుకుఁగా ముంగిటఁ దొంగి చూచు
నాయకునకు మజ్జనజలంబు ఘటియించి
తాపియింటికి నేగి తడవుచూచు
ధవునిచెంగట నిష్టదైవపూజ కమర్చి
తలవాఁకిటికిఁ బోయి నిలిచిచూచుఁ
బతికంచమున శాకవితతులు వడ్డించి
నిలువఁగూడక గోడ నిక్కిచూచు
తే. నెంతబాళియొ కాక యయ్యిందుముఖికి
గూర్మినారాధ్యురాకలు గోరు టొకటె