పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 349

కీనడవడి గలిగె న్మదిఁ
గావున మత్కృతమహోపకారము సుమతీ. 464

మ. అని లంబోదరుతో వటం బతికుతర్కాలంబమై యున్నచో
నినబింబంబుదయంబుఁ గాంచుతటి నాపృథ్వీసుపర్వార్యుఁ డా
త్మనగర్యాదరధుర్యుఁడై యరిగె నంతం దద్రుమాఖర్వగ
ర్వనిరాసంబున కంబికాసుతుఁడు దుర్వారప్రభావమ్మునన్. 465

మ. హితపూజాపరుఁడైన భూసురునితో నే నిచ్చట న్నిల్వ నేఁ
డతిసమ్మోదముతో స్థలాంతరసపర్యాలోలతం బోయెదన్
మతిఁజింతింపకు మంచుఁ బల్కి తలఁగెం బానీయశాలం బడెం
బ్రతివేళాగతపాంథవేధవటముం బ్రాగ్రూప మొందె న్వెసన్. 466

క. ఆవెనుక నేలతొడరితి
దేవునితో ననుచు వట మతివ్యథఁ జెందెన్
భూవల్లభ వింటివికద
యావగ యగుదీవు నన్ను నడిగితివేనిన్. 467

క. అటు గనుక నీవె తెలియుము
పటుగతి నేఁ డెల్లఁ గానఁబడకుండిన ని
చ్చటి కెల్లి వచ్చి తెలిపెద
ఘటియింపు మనుజ్ఞ మన్నికాయంబునకున్. 468

తే. అని ప్రధానతనూజ గేహమున కరిగె
ననుచుఁ గీరంబు వల్క సుధాంశుకాంత
నికరములనీరు జాఱక నిలువఁజూచి
యా ప్రభావతి క్రీడాగృహంబుఁ జేరె. 469