పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

350 శుకసప్తతి

క. క్రమమున భాస్కరుఁ డంతటఁ
గమలాసీనుఁడయి కమలకరుఁడై కమలా
రమణీయుఁ డగుచుఁ గ్రుంకినఁ
బ్రమదాంబుధి దేలి యాప్రభావతి బాళిన్. 470

తే. రాజవిరహప్రభావతిరస్కృతంబు
కృతసఖిప్రార్థనాశతాంగీకృతంబు
నైనభూషణచయము నేమైనదనినఁ
జేరఁ జనుదేరఁజూచి యక్కీరవరుఁడు. 471

తే. అమ్మ నీనుఁ జూచినపుడెల్ల నయ్యమాత్య
తనయ తలఁపునఁ బాఱెఁడు దానినైపు
ణీవిశేషంబు వినుమంచు నిలువఁబట్టి
గట్టిచల ముట్టిపడ సెట్టిపట్టి కనియె. 472

క. తనుమదిగనఁజాలక య
త్యనుపమ మగుచింత విక్రమార్కుఁడు పిలువం
బనిచిన యమ్మఱునాఁడుం
జనియె న్ఘనబుద్ధితనయ సవినయుగరిమన్. 473

వ. అని యథాపూర్వంబుగా నాసీనయై మీనహాసకారణాజ్ఞానాధీనుండైన యమ్మానవాధీశ్వరుఁగుఱించి యాస్థానంబునం గలజనంబులు నిజమధురవచనసుథాసారంబునకుఁ గర్ణాంజలిపుటంబు లొగ్గ నక్కంజనయన యిట్లనియె. 474

తే. పరులు దెలియంగరాని యీపరమగోప్య
మైనకార్యంబు నీవు న న్నడిగితేని
స్వపతి జారుల కెడసినచపల యనెడి
కాంతతో జంట యగుదు వాగాధ వినుము. 475