పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

349 శుకసప్తతి

చ. అలరి మహీరుహాగ్రణి నిజాగ్రపతత్రిభయంకరంబుగాఁ
గలకల నవ్వి యోబుధశిఖామణి నీఫణితంబు విన్న వే
చెలఁగితి నీదునీడ వెలసెం గణనాయకుఁ డన్నమాటకున్
భళిభళి నిశ్చితార్థ మతిభంగికి మెచ్చమి దోష మొందదే. 459

క. అనుమాటకు శైలసుతా
తనయుఁడు కోపించి మంచి తగవౌ నేనిం
దునికి న్నీ విటు ప్రబలితి
నిను జేరుట వెలసినాఁడనే మహిరుహమా. 460

క. మునుపున్న యునికిఁ దలఁపక
ననుఁజేరుటకతన వెలసినాఁ డీగణరా
జని పలుక న్నో రెటు లా
డెను సిగ్గు జనింపదేమొ డెందములోనన్. 461

తే. అనిన జలపాదియై పాదపాగ్రగణ్యుం
డిట్లనియెఁ దైర్థికుండౌర యిట్టివేళ
వీరికలహంబుకతమున వెఱపులేక
యుండఁగల్గెఁగదా యని యూకొనంగ. 462

మ. జలరాశిం బవళించు శౌరి నుదరాంచల్లోకచాతుర్దశీ
కలితు న్మున్గకయుండఁ బత్రమున విఖ్యాతంబుగాఁ దాల్చి మ్రాఁ
కులలో నగ్రగణ్యతం దనరు నాకు న్నీవు ప్రాపన్న సి
గ్గులచే టింత యెఱుంగ కాడితివి నీకుం బ్రాపునై యుండఁగన్. 469

క. నానీడ నిలుచుపథికులు
కానుకగాఁ గొన్ని యొసఁగ గాదే మఱినీ