పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 339

పుటయుఁ దురంగము న్మెసవెఁబో లతిక ల్తెగిపోవఁ బత్రముల్
త్రుటితములై పడం బృథులతుండము భూస్థలి సోఁకునట్లుగన్. 423

తే. అంత సుముఖుని దలఁచి యయ్యశ్వరత్న
మలఘుహేషారవంబునఁ బిలుచుటయును
నిదియె పండ్లెల్ల దినిపోయె నేమొ యనుచు
మందరుఁడు కోలచేఁ బరిమార్చెదాని. 424

క. ఇటువలె నొగిలి తురంగం
బటునిటు వడి పాఱిపోయి యస్మధ్వనియే
మిటికిం జూపితకట యని
చటులవ్యథఁ గుందె మహిభుజా వింటికదా. 425

క. కావున నేఁడెల్లను నీ
భావంబున నరయు మెఱుకపడకుండినచో
నీవిధ మని జలచరహా
౽సావిర్భూతికిని హేతు వమరవచింతున్. 426

తే. అని నియోగితనూజ యయ్యధిపుఁ డనుప
నిలయమున కేగె నని చిల్కపలుకఁ గమ్మ
తమ్మినెత్తావి తెమ్మెర ల్గ్రమ్ముటయును
నల ప్రభావతి కేళిగృహంబుఁ జేరు. 427

ఉ. అంతఁ గ్రమక్రమంబున నహస్కరబింబము పూర్వశైలసౌ
ధాంతహిరణ్యకుంభము విహాయసమండలనామఖేటకా
భ్యంతరధాతురాగ మపరాద్రివిమానవితానితాతిదు
రదాంతవిభావిభావ్యముకురంబును నై జలరాశీఁ గ్రుంకినన్. 428

సీ. అద్దంబులోఁ దోఁచు నబ్జరేఖ యనంగ
మోముపైఁ దెలినాభినామ మమరఁ