పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

340 శుకసప్తతి

దలిరాకుపై మొగ్గు నలరుమొగ్గ యనంగ
మోవిపై ముక్కఱముత్తె మమర
వలమురిపై నంటు జలధిపంక మనంగ
గళము పైఁ గస్తురి కప్పు మెఱయఁ
గాలాహిపై మించు కంచుకంబొ యనంగ
జడమీఁద ముడి పూవుసరము లొరయ
తే. లతనుదోహదధూమము ల్గప్పుకరణి
నంగయష్టిక నీలసంవ్యాన మెసఁగఁ
గదలి యేతెంచె రాజసంగమసుఖైక
పరతఁ జెంది ప్రభావతీపద్మగంధి. 429

ఉ. వచ్చినఁ జూచి కీర మనివారితచాతురి మీఱ నారి నీ
యిచ్చ గణాధినాథు గణియింపు తదాదృతి లేకయున్న నీ
వచ్చటి కేగుకార్యము రయంబునఁ గూడదు చిత్తగింపుమా
తచ్చరితం బటంచు నుచితంబుగ నెచ్చెలి నిల్పి యిట్లనున్. 430

తే. అంత మఱునాఁడు విక్రమార్కావనీశు
డలయమాత్యతనూజాతఁ బిలువఁ బనిచి
చనపరులు చెంతఁ గొలువ నాస్థానసీమఁ
జేరి సింగఁపుగద్దె నాసీనుఁ డగుచు. 431

తే. తెరమఱుంగునఁ గూర్చుండి తేనెవాన
ప్రబలఁ గథఁ జెప్ప నేర్చిన బాఁపనమ్మ
యిప్పుడైనను దెల్పుమా యేలనవ్వెఁ
బక్వమీనము లనుఁడు నప్పడఁతి పలికె. 432

క. అడుగం గూడని కార్యం
బడిగెద వట్లేని మును గజాస్యునితో వా