ఈ పుట అచ్చుదిద్దబడ్డది
338 శుకసప్తతి
నేఁ
జెదరని ప్రీతి నివ్వెలుఁగుచెంగట నివ్వలఁ బొంచియుండెదన్. 418
[1]క. అనిపూన్చి ధీరుతో న
త్యనుపమగతి సుముఖనాముఁ డవగడమగున
ట్లొనరించి వేగవచ్చితి
నని తెలిపె న్రవియుఁ బశ్చిమాంబుధి గ్రుంకెన్. 419
వ. అంత. 420
మ. రవి రాక న్మదిఁగోరు పద్మినులు చక్రస్త్రీలు మోము ల్ముడుం
ప వియోగవ్యథఁ గుందఁ బాల్పడియెమామాడ్కి న్మముం గోరుకై
రవణీలోకము చెంగలించె నది చంద్రప్రేమ మస్మద్విలో
కవిసృష్టం బనిజారలాడ నడరెం గాఢాంధకారచ్ఛటల్. 421
శా. ఆవేళ న్నిజకామినీకరగృహీతాభీలదండావనీ
జావాలీకృతబాహుమూలుఁడు మహీయఃకంబళాచ్ఛాదితుం
డావిర్భూతకఠోరరోషుఁ డయి యాతాకల్పితోర్వారువ
న్యావీరుజ్జనితోత్ఫలాననపరుం డమ్మందరుం డుండఁగాన్. 422
చ. ఘటకుఁడు పంపఁగా నరిగి కంపవెలుంగు తలంగఁద్రోచి యు
ద్భటగతి బుద్ధిసారుఁ డటు తారునఁ గర్కరికాఫలాళిఁ జూ
- ↑ క. అనిన విస్మయమంది యయ్యశ్వరత్న
మెంత తార్కాణగాఁ జెప్పె నితఁ డటంచు
నెంచి యాహారవేళఁ దలంచువాఁడ
ననుచు నమ్మిక లిచ్చిన నాక్షణంబ.
క. చని సుముఖుం డధిపతితో
ననఘా యీయశ్వమునకు నవగడమగున
ట్లొనరించి వేగవచ్చితి
నని తెలిపె న్రవియుఁ గ్రుంకె నాసమయమునన్.