పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 337

వ. అని ధీరాగమనంబు సవిస్తరంబుగాఁ దెలిపి వెండియు. 412

తే. నీవు మాకెల్ల దొరవోలె నేఁడు మొదలు
కొన్నినాళ్లుండు భవదీయఘోరమూర్తిఁ
గాంచి ధీరుం డపూర్వమృగం బటంచుఁ
దలగు నది మాకు శుభము గంధర్వరాజ. 413

క. ఈరేయి దోసపం డ్ల
వ్వారిగఁ దిను మర్కు డపరవసుధాధరముం
జేరిన పిమ్మట నిలుమీ
చేరువ నే నపుడు వచ్చి చేర్చెదఁ దోఁటన్. 414

క. అనిపల్కి బుద్ధిసారుఁడు
చని యంతయుఁ దెలిపె ఘటకజంబుకకులనా
థున కంతటఁ జారులు దె
ల్పిన నది విని ధీరుఁడొక్క లేనగవలరన్. 415

క. తనమంత్రి సుముఖనామకుఁ
గనుఁగొనుటయు నతఁడు లేచి కార్యముమీఁద
న్ననుఁ జిత్తగింపు మనుచుం
జనియెం దత్తురగమున్న చక్కటి కెలమిన్. 416

చ. చని కరము ల్మొగిడ్చి బుధసన్నుత జంబుకజాతివాఁడ న
త్యనఘుఁడ నే నతీతము ననాగతము న్మఱివర్తమానముం
గని వివరింతు నిప్పు డొకకాఱియచే వెతఁ జెందినాఁడ వి
ద్ధినమున నీకుఁ గల్గువడదేఱఁగ గర్కరికాఫలావళుల్. 417

చ. ఇది నిజమైన ఱేపు వచియించెదఁ దక్కినకార్యమంతయుం
దుదినొక విన్నపంబు దయతో విను మాఁకటఁ గుందినాఁడ నేఁ
డదనున దోసపండ్లు తినునత్తఱి నన్నొకసారి పిల్వు