పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 331

ప్పదు మనమ ట్లొనర్చినను బ్రాభవహానియె గౌరవంబు సొం
పుదనర మున్ను మ్రొక్కి గద మ్రొక్కు గొనన్వలయుం జగంబునన్. 381

క. అనిన విని సచివులందఱు
ననఘా మఱి యాతఁ డింత యధికుం డైనం
గొనివచ్చి పూజలిచ్చిన
మనకుం దప్పేమి యది సమంచిత మనినన్. 382

తే. బుద్ధిసారాఖ్యసచివుండు పూని పలుకు
దొరను మంత్రులఁ జూచి సంతోషమయ్యె
మొదల నెందైనఁ జన నాకు ముదలయిచ్చి
ధీరజంబుకవరుని సంధింపఁజనుఁడు. 383

వ. అనినం దదీయసంధానసముత్సాహభంగకారణం బగు నతని ప్రతికారవచనంబులకుఁ జిడిముడిపడి యితం డేమి యెఱుంగు విచ్చేయుం డనుచు సంధానపరకృత్యులైన యమాత్యులం గూర్చుండ నియమించి యామృగధూర్తచక్రవర్తి యిట్లనియె. 384

క. ఒకనికిఁ దెలియు న్వేఱొక
నికిఁ దెలియక యుండుఁ గార్యనిర్ణయ మితఁడే
టికి నడ్డుగాళ్లు వైచెనొ
యకటా యది యెల్లఁ దెలియ నడుగన్వలయున్. 385

క. అని బుద్ధిసారు నెమ్మొగ
మునఁ జూపులు నిలువఁ గేలు మొగిచి యతం డో
యనఘాత్మ వీరికన్నం
ఘనుఁడంగా నైన నొక్కకార్యము వినుమా. 386