పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330 శుకసప్తతి

ఫలపరంపర నుదరసంభరణవృత్తి
నడుపుచుండఁగ మందరుం డలుకవొడమి. 375

ఉ. అక్కట దోసతోఁట యిదియైనఁ దదీయఫలంబు లమ్మి యీ
డొక్కను సాకగోరితిఁ గడు న్నడురేలున వచ్చి యెవ్వరో
మక్కువ లేక నాకడుపుమంటయుఁ బుచ్చికొనంగఁ బూని యీ
చక్కెరవంటి పండ్లు తినసాగి రటంచుఁ గృశించు నెంతయున్. 376

చ. ఒకమృగధూర్తరాజవరుఁ డుజ్జ్వలనీతివిదుండు ధీరనా
మకుఁ డతిదూరఘోరననమధ్యవిహారుఁడు విద్విషద్విదా
రకుఁ డొకనాఁడు వేడుక సరాళముగా భటకోటితోడ నో
డక యరుదెంచె నచ్చటి కటత్తటిదీక్షణవీక్షితాస్యుఁడై. 377

తే. వచ్చి బడలిక దీర్చు దుర్వారకర్మ
రీఫలామోదధౌరంధరీవరిష్ట
పవనములచేత నాహారభాగ్య మిచట
నబ్బు నని యెంచి కెలని బిట్టడవి విడిసె. 378

క. తనమంత్రి వరులతో మం
తనమున నీదోసతోట తనరెడుచోటన్
మనజాతివార లుండరె
యని యాలోచన మొనర్పు నాసమయమునన్. 379

మ. ఘటకుండంతట వేగువారు నుడువంగా ధీరుఁ డారీతి వ
చ్చుట లెల్ల న్విని మంత్రులం బిలిచి యిచ్చోఁ బోయి సంధించి యు
త్కటమద్వైభవ మెల్లఁ జూపుటనువో కాదో విచారింపుఁ డే
మిటికన్న న్మన కొక్కవేళకగు తన్మిత్రత్వమం చెన్నెదన్. 380

చ. అది యటులుండె నంతటి మహామహుఁ డిచ్చటి కేగుదెంచినం
దుది మొద లే నెఱింగియు నెదుర్కొని పూజయొనర్పకున్కి యొ