పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 329

ఖ్యాకలితుండు శూద్రుఁడు నయాన్వితుఁడై తగునాతఁ డిందిరా
లోకన మేమి లేమి నతిలోకదరిద్రతఁ జెంది కుందుచున్. 371

సీ. కొలుచువారల నోరుగొట్టి లెక్కలు వ్రాసి
హరువు మీఱఁగ మణియములు చేసి
బ్రమసి యాసాసలరసవాదము లొనర్చి
ప్రకటించి రాజపట్టికలు దీర్చి
ప్రతివాసరంబు లేర్పడఁగఁ జేరువగట్టి
వాటంబుగాఁ దెరువాటు గొట్టి
వేళ్లమందు లమర్చి విషవైద్యతవహించి
తఱుఁగుబేరముల నెంతయును మించి
తే. మ్రుచ్చువగయును గని చూచి మూటమోసి
సుంకరులతోడ నొనగూడి జూదమాడి
యిట్లు వర్తించియును నాతఁ డేమి యందు
గళవళముఁ జెందెఁ గూడుఁ గోకయును లేక. 372

తే. అంత నమ్మందఱుం డమందార్తి నుదర
పోషణంబునకై యూరిపొంత దోస
తోఁటఁ గావించెఁ గావడిపాటుపడుచు
నదియు నధ్వన్యదృక్పరం బై తనర్చె. 373

ఉ. అంతట నొక్కనక్కదొర యంబుజబాంధవుఁ డస్తపర్వతో
పాంతముఁ జేరుదాక బొరియం జఠరానలకీల నెంతయుం
జింతిలుచుండి రేలు తన జీతపుబంటులు దాను భీతియొ
క్కింతయు లేకయే మెసవి యేగుఁ దదీయఫలంబు లన్నియున్. 374

తే. ఆసృగాలాగ్రణికి ఘటకాక్య వెలయు
నాతఁ డీరీతిఁ గర్కరికాతిపక్వ