పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328 శుకసప్తతి

తే. అని యమాత్యతనూజ యయ్యధిపుచేత
నంపకము గాంచి యింటికి నరిగె ననుచు
జిలుక వచియింప నంతలో జలజబంధుఁ
డుదయగిరిసౌధవీథిపైఁ బొదలుటయును. 366

చ. కనుఁగొని యాప్రభావతి జగజ్జనరంజనరాజభాషణం
బెనయక చిల్క పల్కులకు నేమఱియెన్ హృదయం బటంచు మో
హనగృహసీమఁ జేరి మఱి యంబుజము ల్ముకుళించు వేళఁ బూ
నినపని కేగుచోఁ గలువనేజపురాయనితేజి యింపునన్. 367

తే. కప్పురపుబొట్టు చెమటచేఁ గరఁగి జాఱెఁ
జక్క దిద్దుము పూర్ణిమాచంద్రవదన
యింతలో నొక్కకథ వినిపింతు ననుచుఁ
బలుకఁదొడఁగెను బులకండ మొలుకుచుండ. 368

క. మఱునాఁడు విక్రమార్కు
డరసియుఁ దెలిసికొనలేక యమ్మంత్రిసుతం
బరిచారకయువతి పరం
పరచే బిలిపించికొని సమాదరణమునన్. 369

తే. తెరమఱుంగున నిలుప నత్తెఱవ పరుల
నడుగఁగూడని యిక్కార్య మడిగినపుడె
ప్రబలతరమైన జాతిస్వరంబుఁ జూపి
యడలు తురగంబుతోడ జోడగుదు వీవు. 370

అయిదవ యుపకథ


ఉ. ఆకథఁ జిత్తగింపుము ధరాధిప సాధువనం బనంగ న
స్తోకతరప్రసిద్ధిఁ బొలుచుం బుర మొక్కటి యందు మందరా