పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296 శుకసప్తతి

తే. అపుడు సందియమంది రోషార్తుఁడైన
పురుషుతో నది యేలీలఁ బొంక వలయుఁ
బలుకుమనినఁ బ్రభావతీపంకజాక్షి
తేటపడ నీవ యిదియును దెలుపుమనిన. 219

తే. చిలుక యిట్లను నప్పు డచ్చెలువ మోస
కారిపెనిమిటి యోవన్నెకారిమగడ
యేల చూపితి విప్పుడ యీధనంబు
ధనపిశాచంబులివి యథార్థమ్ము సుమ్ము. 220

క. ధనముపిశాచులు ఘంటా
ధ్వనితోఁ గాచుకొని యుండు ధనమన వినమే
కనుగొంటిమి గద గంటలు
చను నే బలివెట్ట కర్ణచయ మిలు చేర్పన్. 221

తే. ఇంకనైనను బలి దెచ్చి యీయకున్నఁ
బొసఁగదని పల్క నతఁడు కాబోలుననుచుఁ
గాళ్లునొప్పియుఁ జూడక కాఁపుటింటఁ
గోడిఁ గొనితెచ్చి బలిపెట్టి కోర్కెఁ జెందె. 222

చ. అని తెలుపం బ్రభావతి యయారె కథాస్థితియంచు మెచ్చి య
య్యినుఁడు సురేంద్రదిక్కుధర మెక్కుట కేళినిశాంతసీమకుం
జని తమినాఁటిరేయి నృపచంద్రుని జేరఁగఁగోరి యేగుదెం
చినఁ గని దానితోఁ బలుకుఁ జిల్క మరందరసంబు చిల్కఁగన్. 223

వ. ప్రభావతీ నిజవదనవక్తవ్యవార్తావిశేషంబు పరులచేతం బలికించి తనయందు నీషద్దోషంబు లేకుండం జేసిన బాలసరస్వతీనామధేయ యగునమాత్యనందనకుం గలయనివార్యప్రభావంబు నీకుం గలిగినంగాని యొప్పని యిప్పనికిం బోవుట