పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 295

క. కడలకు మచ్చట పాము
న్నది యందు రటంచు వాని నట్లుంచి రయం
బొదవ న్వాకిలి దెఱఁచిన
మదియలరం పెట్టి కేళిమందిర మెనసెన్. 213

తే. అంతలో నేమి చెప్పుదు నట్టియపుడె
వచ్చె హనుమంతగర్వదుర్వారశౌర్యుఁ
డైన రణధీరుఁ డేతెంచి యధికహర్ష
మెనయ వాకిలి దెఱవ నవ్వనితఁ బిలువ. 214

క. గుండె పటుక్కన వచ్చె వి
భుం డిఁక నెట్లనుచు మల్లపుంగవుఁ బథికుం
డుండెడునట్టుకపై వాఁ
రొండొరులం గానకుండ నునిచి వినీతిన్. 215

తే. గడియ సడలించి కన్నీటఁ గాళ్లుకడిగి
కొమ్మ కౌఁగిటఁ గదియించి కుస్తరించి
పడుకయింటికి నరిగి దీపంబుఁ బెట్టు
మని నిజోదంత మాద్యంతమును వచించి. 216

చ. తనభుజశక్తి మెచ్చి సముదారత నచ్చటి భూమిభర్త యి
చ్చినధన మెల్లఁ జూపి యిది చేరుటఁ జూడఁగ దీనివంకఁ జు
మ్మని వివరించి దెల్పుటకు నయ్యొఱడుస్సీ కృపాణిఁ గేలఁగై
కొని ఝళిపించినం గడు దిగుల్పడి యాతనిదిక్కుఁ జూచుచున్. 217

క. ఆట్టుకపైఁ దగు తెఱువరి
జెట్టియుఁ దముఁ జూచెనేమొ చేతం గరవా
ల్పట్టెనని తలఁచి తత్తఱ
ముట్టిపడం డిగ్గనుఱికి యురువడిఁ బఱవన్. 218