పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294 శుకసప్తతి

యిచ్చినం
బొదలి తదుక్తరీతి నటపోయి వెసన్ దృఢబాహుఁ డయ్యెడన్. 207

తే. గంట మొరయింప నవ్వాలుగంటి తలుపు
తెఱచి తోకొనిపోయి మందిరములోన
నునిచి నీకిడఁగోరి నేఁడొక్కపథికు
మన్నిగొంటి నటంచుఁ బ్రేమంబు నిగుడ. 208

క. అనఁటాకున నన్నము శా
కనికాయం బునుపఁ బాపి కట్టడికానా
యనుచు భుజియించి దీపం
బునుపమిఁ దనతెఱఁగు తెలియకుండఁగ నంతన్. 209

క. రమణీయశయ్యపైఁ ద
త్కమలేక్షణఁ గూడి మదనకదనక్రీడా
త్యమితానందముఁ జెందెం
దమిదీఱఁగ బంటువానిధర్మం బనుచున్. 210

ఉ. అంతట మల్లవర్యుఁడు లతాంతకృపాణనితాంతమర్దిత
స్వాంతతవచ్చి నిల్చి తలవాకట ఘంటిక మ్రోయఁజేయ న
య్యింతి యిదేమొ యంచు నొకయించుక చింతవహించి తద్విధం
బంతయుఁ గాంచి ని న్నెఱుఁగనా యనుచుం దృఢబాహుతో ననున్. 211

తే. మంచి దెవ్వనిచేతనో మర్మ మెఱిఁగి
వచ్చి తందుల కేమి నీవాంఛ దీఱె
జెట్టి యరుదెంచె వాని జోకొట్టి నిన్ను
బనుతు నందాఁక నట్టుకపై వసించు. 212