పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 297

ముప్పవుఁగదా యనిన నప్పడంతి తప్పక కనుంగొన నప్పతత్రిగోత్రారి యిట్లని చెప్పందొడంగె. 224

ఇరువదియవకథ


ఉ. ఉజ్జయినీపురంబు మెఱయు న్మణిహర్మ్యశిఖావిహారియో
షిజ్జన మొక్కచో జలము చేఁదికొనం దలవాంచఁ దన్ముఖో
ద్యజ్జలజాభియాతికి భయంపడి దేవనదీరథాంగముల్
పజ్జ ముడుంగఁ బాఱుఁ బృథుపద్మకుడుంగములం దడంగగన్. 225

ఉ. ఆపుర మేలు పూర్ణకరుణాభరణుం డగువిక్రమార్కుఁడు
దీపితమంత్రశక్తి గడిదేఱిన భట్టి యుపాయ మాత్మబా
హాపరిపాలితం బటుసమగ్రశుభప్రతిపాదిగా బుధ
స్థాపకదానలక్ష్మి యను దాది యశోరుచికన్య బ్రోవఁగన్. 226

ఉ. ఆతని కొక్కమంత్రి గలఁ డద్భుతశీలుఁడు పుష్పహాసవి
ఖ్యాతుఁ డతండు నవ్విన లతాంతపువాన యెసంగు నిస్తులా
స్తోతకరాద్భుతక్రియలు చూచినయప్పుడు మానసైకశో
కాతిశయంబు బల్మిని దదాస్యము హాస్యము గాన దెన్నఁడున్. 227

తే. అంత నొకనాఁడు విక్రమార్కావనీంద్రుఁ
డంతిపురమునఁ గదళిక యనేడు పేరఁ
దనరు మోహపురాణియుఁ దానుఁ గూడి
పొత్తుల భుజింపఁగా నొక్కబోనకత్తె. 228

తే. ఒఱపు దనరారఁ జేఁపలయూర్పుఁగూర
యిడినఁ గదళిక చే యెగనెత్తి యాస్య
మవలగాఁ ద్రిప్పి యిదియేమి యారగింప
వనెడు పతిఁజూచి రానిజంకెనలు నిగుడ. 229