పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 239

పదాఱవకథ

క. ఏలానగరంబున గో
పాలుం డొకఁ డమరు విష్ణుభక్తుఁడు ధర్మా
లోలమనస్కుఁడు తంత్రీ
పాలుం డనువాఁడు నిఖిలబంధుప్రియుఁడై. 545

సీ. పులుల వాకట్టుమందులు పాముబదనిక
ల్పొదుగుచేపుఁడుమంత్రములను గోడె
దామెనపగ్గము ల్తలత్రాళ్లు నురిత్రాళ్లు
చిక్కంబులును జల్దిచిక్కములును
మాఱుమానిసిఁగన్న దూఱువేపులజోళ్లు
కొలికిచెప్పులు జమ్ముగూడ లలఁతి
పిల్లగ్రోవులు నెక్కువెట్టినవిండ్లు కం
బళ్లు దుప్పట్లును వల్లెతాళ్లు
తే. మొదలుగాఁగల పరికరంబులం గొఱంత
లేక భూమీరుహచ్ఛాయలే గృహాళి
గాఁగ వాఁడాలమందలం గాచుబాళి
నడవిమానిసియై తిరుగాఁడు నెపుడు. 546

చ. పిదికిన యాలపా ల్వెదురుబియ్యము కావడికుండ నించి య
య్యదుపతి కింద్రియంబుగఁ దదాహృతవహ్నిసమిత్పరంపరా
భ్యుదయము నొందఁజేసి పయిపొంగలి వెట్టి భుజించు నాతఁ డిం
పొదవఁగఁ డేకుటాకుల వనోర్విని మందలఁ గాచువేళలన్. 547