పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 227

క. గురికాఁడు రాక మన మీ
తరుణీభూసురులఁ బట్టఁదగదని చుట్టుం
బురిగొనుచుండిరి యాతల
వరు లంతట నదియు నతనివాంఛలు దీర్చెన్. 491

క. ఆలోన యామికావళి
యాలోచన యెఱిఁగి మగని హలికాళికచం
జాలిజడకుండఁ గావఁగ
శీలవతీకాంత కొంతచింత యొనర్చెన్. 492

క. అని మఱియు నా ప్రభావతిఁ
గనుఁగొని యచ్చిలుక పలికెఁ గలికీ యిఁక న
వ్వనితామణి వారలనే
యనువునఁ గావవలెఁ దెలియ నడిగెదఁ జెపుమా. 493

క. అని యడిగిన కథ కద్భుత
మున మునుఁగుటఁ బలుకలేని ముద్దియమొగమున్
గనుగొని యదియుం దెలిపెద
వినుమనియెం జిలుక యమృతవిధమధురోక్తిన్. 494

తే. అట్లు తలపోసి యొకయుపాయంబుఁ గాంచి
బళ్ళెమునఁ బెద్దజోతి యేర్పఱుచుకొనుచు
నిల్లు వెలువడి దేవతాగృహము చేరఁ
దెగువమై వచ్చె శీలవతీలతాంగి. 495

క. ఆనాతిఁ జూచి తలవరు
లేనెలఁతయొ గండదీప మెత్తఁగ వచ్చెం
బోనిమ్మని కనుగొన న
మ్మానిని గుడిసొచ్చి కనియె మగని న్మగువన్. 496