xxi
4. లోకానుభవము:--కదిరీపతి లోకానుభవ మసదృశమైనది. అతఁడు తానువర్ణించువిషయములను సమగ్రముగా పరికించి గమనించి(keen observation) నట్టివాఁడు. ఒక యువతి తన భర్తతోఁ బుట్టినింటికి వెళ్లక యెన్నో యేండ్లయ్యెననియు తన తల్లిదండ్రుల యొక్కయు నన్న యొక్కయు గుర్తే మరిచితి ననియు రాత్రి పల్కుటను నరుగుపై పండిన తెరువరి విని మరునాఁ డామెయన్న నని చెప్పి యింటిలోనికిపోఁగా నాకులట తనభర్తను నమ్మించుటకై కృతకసోదరునితో నెన్ని మాటలు మాట్లాడెనో చూడుఁడు.--
సీ. మన యమ్మ కడుసుఖమ్మున నున్నదే, యయ్య, పెద్దవాఁడయ్యెగాఁ, బేర్మి నతని
బోషింతురే మీరు పొరచూపు లేక నా, యరిది చెల్లెలి వచ్చి యత్తవారు
తోడ్కొనిపోయిరే, దూరంబు గాన యే, వార్తయు వినము మావదినె నేక
టని వింటి నే బిడ్డ గనియెనొ మగవాని, గనియెనో యది మేలుగాక యాడు
దాననై పుట్టి మీము జూడ గాన కిట్టు
లేను బడుపాటు చాలదా, యెన్నడైన
దలతురా నన్ను మీరు డెందంబునందు
నేల తలతురు, మరచిపోయితిరి నన్ను.
చ. చెలియలి పెండ్లి చేసితిరి, చిల్లరపబ్బము లెన్ని యైన శో
భిలె నను నెన్నడైన బిలిపించితిరే పిలిపింపకున్న నే
మలరెడుకూర్మినాఁడుపడు చాసపడుంగద యంచు పచ్చపో
గులుగలచీర యంప నొనగూడకపోయెనె యేమి చెప్పుదున్.
గీ. ఇపుడు మీపుణ్యమున నాకు నేమికొదవ
యుండె నేను ధరింపగా, నొకరి కీయ
గలదులే యందులకు నంటగాదు మీద
యాదాక్షిణ్య మిటువంటి దంటి నింతె.(15వ కథ)