పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XX

    “ఓసి లేవే మల్లి! వేసాలు సేయకు, మగవార లెరుగనిమర్మ మెద్ది"
    “నీ కేటి సిబ్బతినెరరాగవై మించి, యడగదొక్కినదాన వత్త గారి”
    “పెద్ది! విన లేదె! మనసుబ్బు పెరటి గోడ
    దాటగా మామ గనె నట", "యేటి సుద్ది,
    యెసగి మగ డొల్లకున్న న దేమి సేయు,”
    ననుచు కసివోవ బలుమాట లాడికొనుచు.

(14వ కథ)

ఇట్టి సన్నివేశములందలిహాస్య మానందదాయక మైనది. ఒక స్త్రీ తనభర్తను పురికొల్పుటకై 'చిఱ్ఱుబుస్సనుచు నసూయాక్రాంతయై,

గీ. చట్టితోఁ జట్టి పగులంగఁ గొట్టి తనదు
    పదరులకు నింటిబలుకుక్క లదరికూయ
    నడరు భయమున గ్రుక్కుమిక్కనక వెనుక
    వెనుక కొదిగెడు తనప్రాణవిభుని జేరి.

ఇట్లనెను,

    "పొరుగింటి పద్మినీసతి, గిరుకుచు మట్టియలు గిలుకుగిలు కని నడువన్
    మెరమెరలు పుట్టవే కాఁ, పుర మేటికి మగఁడు పొట్టపోయకయున్నన్."

(20వ కథలో 1వ ఉపకథ )

“గిరుకుచు మట్టియలు గిలుకుగిలుకని నడవన్" అని చదువగానే యాస్త్రీ ప్రౌఢయనియు, ముత్తైదువయనియు, వయ్యారి యనియు, గల్లుగల్లుమని మట్టెలకలస్వనముతో మన సమీపమందే నడిచి వెళ్లిన ట్లనిపించకమానదు. కథాసన్నివేశములందు, వర్ణనలందు, ప్రతిపుటలో నుత్తమహాస్యమును నింపిన ఈకవిత మున తెనుఁగు సారస్వతములో క్రొత్త పద్ధతి!