పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98 శుకసప్తతి

లోలునిఁ జేయువార్త మహిలో నుడున న్వినరేమొ యట్లనీ
శాలిక నాసమగ్రగుణశాలికిఁ బెండ్లి యొనర్తు నావుడున్. 409

తే. ఆవిభుండు ప్రమోదసద్భావుఁ డగుచు
సెలవొసంగిన నిరుమ్రోలఁ జెలులు గొలువ
నవ్వరారోహనాందోళికాధిరోహఁ
జేసి కార్యప్రవర్తనోల్లాస మెసఁగ. 410

సీ. నేల జీరకయుండఁ గేలఁ గుచ్చెలఁ బూను
కొని యూడిగపుసతు ల్గునిసి నడువ
మడమెత్తు పర్వుతో మంత్రాక్షతము లీయఁ
బాల్పడి భూసురభార్య లెదుర
నొక్కకీ లొరఁగుపై నునిచి యేకాంతంబుఁ
దెలుపుచుఁ గూర్మి నెచ్చెలులు సనఁగ
జయకేతనునివార్త సారె విచారించి
వచ్చి ప్రగడకత్తె లెచ్చరింప
తే. సొంపుతోఁ బౌరకామిను ల్గుంపుగూడి
యమ్మ యిదిగాక సౌభాగ్య మనుచు మెచ్చ
నప్పు డుద్యానవనవాటి కవ్వధూటి
నెలమిఁ దోతెచ్చి యాచెంత నిలుచునంత. 411

చ. పిలపిల నాజయధ్వజుని బెద్ద లెదుర్కొని రాకురాకుఁడో
యళికచలార భీతహరిణాయతనేత్రల మత్ప్రభుండు నా
వలనను జూడ నోడుననువార్త వచించిన మందహాసకం
దళవదనం బెలర్పఁగ ముదం బలర న్మృదువాణి యిట్లనున్.