పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 97

తెల్పినం

జాఱుం గేకి పికాళిసంఘములు వాచావైఖరిం బోరుఁ ద
న్నారీరత్నము తజ్జయధ్వజసముద్యన్తోహసంక్రాంతయై. 404

తే. అలహరిద్రానిభాంగి సౌధాగ్రసీమ
నుండ కవనికి డిగియె రేయెండ కళికి
ప్రాణసఖు లెల్ల నెండకుఁ బశువు దలఁకి
నట్లు నీ వేల తలఁకెద వనుచుఁ బలుక. 405

[1]క. భావ మెఱిగింప నేరక
యావెలఁదుక యున్నఁ జెలువ లవ్విధమెల్లన్
భూవల్లభునకుఁ దెలిపిన
నా వేళ నమాత్యహితకృతాలోచనుఁడై. 406

ఉ. కన్నియ యీజయధ్వజునిఁ గాని వివాహ మొనర్ప నొప్పదే
ధన్యుఁడు నైనవాఁడు వనితాజనతైకపరాఙ్ముఖుండు సా
మాన్యమనీషి కీవగ యొనర్చుట కొద్దితెఱంగు తెల్పుఁడో
మాన్యచరిత్రులార! యని మంత్రులతో విభుఁ డానతిచ్చినన్. 407

క. పొసఁగ దిది యనుచు మంత్రులు
గుసగుసలంబోవ రాజకుంజరుతోడన్
వెసమృదులవాణి యనఁదగు
బిసరుహముఖ యొకతె విన్నవించెం బ్రీతిన్. 408

ఉ. ఏలవిచార మింతుల నొకింత యెఱుంగని ఋష్యశృంగునిం
బాలికలండఁ జేరి యొకబాలికఁ బెండ్లి యొనర్చి భామినీ

  1. క. ఆవివర మెల్లఁ బాండ్య
    క్ష్మావల్లభుఁ డెఱిఁగి శాలికాబాలికకున్
    ఠీవి వివాహ మొనర్చుట
    కావేళ నమాత్యహితళ్ళతాలోచనుఁడై.