పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 99

క. మునుమున్న తద్రహస్యము
విని యున్నదిగానఁ బ్రౌఢవృత్తి నలసుధీ
జనములతో నను గాంతా
జనరత్నము మధురరసవచస్ఫుటఫణితిన్. 413

ఉ. ఈయెలదోఁట నుండఁదగ దింకొకచక్కి వసింపనేగుఁడో
ధీయుతులార! పాండ్యనరదేవతనూభవకేళికాగృహ
ప్రాయత నిందు నెప్డు నిరపాయమున న్విహరించుచుండు నే
డాయెలనాఁగ గ్రుమ్మరుటకై యదెవచ్చెఁ దలంగుఁ డిత్తఱిన్. 414

తే. ఇంతమాత్రంబె కాదు పూర్ణేందుముఖులు
సమ్ముఖంబునఁ గార్యప్రసంగవశతఁ
బెండ్లి యనుమాటఁ బేర్కొన్నఁ బెనిమి టనిన
మిట్టి మీనై యదల్చు నమ్మీననయన. 415

క. ఇది యేమినిమిత్తమొ యని
మది నెంచితిరేనిఁ దత్క్రమంబంతయు నీ
యదన వివరింతు వినుఁడిం
పొదవం దొల్లింటిజన్మ మొదవినవేళన్. 416

ఉ. తా నొకహంసియై సరసత న్నిజవల్లభుఁ డుల్లసిల్లఁ జి
త్తానుగుణోన్నతి న్మెలఁగు నంతటిలో నొకనాఁడు చెంత నిం
పైనసరోవరంబుఁ గని యచ్చటి కేగి విభుండు నిర్నిరో
ధానుపమానసౌఖ్యవిభవాప్తి మెయి న్వెసరాక చిక్కినన్. 417

క. మగఁ డేల రాఁడొ యొండొక
మగువం దగులుకొని నన్ను మఱిచెనొకో మనం
బగలెడు నని దిగులొందుచుఁ
దెగువం బ్రాణములు విడిచె దీనాననయై. 418