తెలుగు. | ఒండేమి మల్లికార్జున | 387 |
పై రెండింటిని పరిశీలించినచో, తెలుగు కృతికే, కన్నడ మనువాద మనియు రెండింటికి కర్త మల్లికార్జున పండితుడే యనియు స్పష్టమగుచున్నది. కన్నడ భాషలో ప్రాస యుండునుగాని యతి యుండదు అందుచేత యతి ప్రాస లున్న తెలుగు కృతియే ముందు రచితమైనరని చెప్పవచ్చును-ఇక దీని మూలమున పరిష్కరించిన ఈ క్రింది విషయములను చూచినచో, కన్నడగ్రంథ విశేషము లెంతగా నుపకరించినవో తెలియగలదు.
పూర్వ ముద్రణము - పూ. ము. అను సంకేతికము. నూత్న ముద్రణము - నూ. ము.
నష్టభాగ పూరణములు
1.పూ.ము. క. | ...... | 266 |
ఇందు మొదటిపాద మీక్రింది కన్నడ పద్యమునుబట్టి పూరింపబడినది.
క. | జ్ఞానం వైరాగ్యమెన | 278 |
కాబట్టి మొదటిపాద మీ క్రిందిరీతి నుండును.
నూ.ము.క. | (జ్ఞానము వైరాగ్యము నన | 267 పుట 51 |