98 వ్రతరత్నాకరము
98 వ్రతరత్నాకరము నకు చక్కని లక్షణములుగల శీల యను పేరుగల కన్యక పుట్టెను. ఆచిన్న బిడ్డ చక్కనినడతగలదై తల్లియింట దినదిన ప్రవర్ధమానమై యుండెను. ఆచిన్న బిడ్డకు తల్లి యగు దీక్ష జ్వర ముచేఁ గష్టపడి, నానాటికిఁ జిక్కి నదీతీరంబున మృతినొంది స్వర్గలోకంబునకుఁ బోయెను. తర్వాత సుమంతుఁడును అగ్ని హోత్రాదికార్యములు లేకపోవునసు భీతిచేత చెడు స్వభావంబు గలదియు, క్రూరురాలును, ఎల్లప్పుడు జగడములాడునది యునైన కర్కశయను పేరుగల కన్యను బెండ్లి చేసికొనెను. ఆశీలయన్న నో తనతల్లి చనిపోవుటచేత నింటిషసులు చూచుటయందు శ శ్రద్ధ గలదై, గోడలకు, స్తంభములకు, చిన్న గోడలకు, కడపలకు, మొత్తలకుఁ బంచవన్నె ముగ్గులను బెట్టుచుఁ గమలములను స్వ స్తికములను వేయుచు దేవపూజలు చేయుచుండెను. తం తండ్రి యగు సుమంతుఁడును తనకూఁతునకు యాచనపుచిన్నెలు వచ్చుటను చూచి ఈకన్య నేవనికిస్తునని యాలోచన చేయుచుం డెను, అప్పుడు కౌండిన్యుఁ డను ఒక మహాముని సకలవిద్యలను జదివి గుర్వాజ్ఞను బొంది పెండ్లి చేసికొనుటకై వచ్చుచుండెను. సుమంతుఁడును తనకూఁతు నాయన కియ్యవలసినదని నిశ్చయిం చెను. అట్లు నిశ్చయించి, కౌండిన్యమహామునికిఁ దనకూఁతు నిచ్చి తన శాఖ ప్రకారము పెండ్లి చేసి, పెండ్లియయినతర్వాత, తన భార్యయగు కర్కశను బిలిచి "అల్లునికి బహుమతిగా సారె పెట్టి పంపవలయును, “ఏమియున్నది" యనియడుగఁగా, ఆకర్క యా బ్రాహ్మణుని మాట విని మిక్కిలి చిరాకుతో లోపలికి వచ్చి తలుపు టంగున బిగించి, “పోపో" యని పలికెను. అంత నా సుమంతుఁడు మిగిలిన సత్తుపిండి నిచ్చి తనయల్లుని, కుమార్తెను సాగనంపెను.