పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేదారేశ్వర వ్రతము

యైశ్వర్యమదముచే మై మఱచినదై, యాకేదారేశ్వర వ్రతంబు నుల్లంఘనము చేసెను. అది కారణంబుగా నాభాగ్యవతిని కొడుకుతోఁగూడ దానిభ క్త యొక కారణంబుచే రాజ్యమునుండి తఱిమెను.

అంతట నాభాగ్యవతి తనపిల్ల వానితోడ నడవు లెల్ల ఁదిరిగి మిగులడస్సీ, కడపట నొకబోయవానియిల్లు జేరి, తన కొడుకును బిలిచి, “నాయనా? యీయుజ్జయినీ రాజుభార్య నాకక్క గావలెను. కావునఁ బెతల్లికడకుఁ బోయి, మనసంగతి యెఱిఁగించి, ధనముఁ గొనికమ్మని చెప్పి పంపెను. ఆబాలుఁడును ఉజ్జయినికే తనపై తల్లి యగుపుణ్యవతికిఁ దనతల్లి రాజ్యమునుండి తఱుమ గొట్టఁబడి యడువులం దిడుమలుపడుచుండుట చెప్పి యామె యిచ్చిన విస్తార ధనంబును గైకొని వచ్చుచుండెను. దారిలోఁ గేదారేశ్వరుఁడు దొంగవలె వచ్చి యాధనము నసహరించుకొని పోయెను. మఱల సబ్బాలుఁడు వెనుకకుఁ బోయి, తాపడిన తంటాలు చెప్పి, మఱలసొముగొనివచ్చుచుండఁగా కేదారేశ్వరుఁడు ముందటివలె నతనికిఁ గనఁబడకవచ్చి సొమ్ముదోఁచుకొని, దీనుఁడైన యాబాలునిఁ జూచి 'ఓభాగ్యవతీపుత్రుఁడా! వ్యసనంబు నొందకుము. నావ్రతంబు సుల్లంఘించినవారి కీధనంబు దగదు' అనిచెప్పెను. అంత నా బాలుఁడు, బుణ్యవతి కీవృత్తాంతంబుసు జెప్పెను. అంతటఁ బుణ్యవతి యాబాలునిచే నా వ్రతంబు చేయించి, అబ్బాయీ! తల్లి చేత నీనోము నోమించుమని చెప్పి వానికిఁ గావలసిన ధనం బొసఁగి పంపెను.

అంతట నాబాలుఁ డాధనంబుసు గైకొనివచ్చుచుండఁగా, ముందు దానుబోఁగొట్టినధనమంతయు దారిలోఁ బడియుండెను