Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేదారేశ్వర వ్రతము

నెయ్యి, కేదారేశ్వర వ్రతము 141 నాయిరువదియొక్క మంది. బ్రాహ్మణులను బూజింపవలెను. తర్వాత కలశమునందు కేదార దేవుని నావాహనము చేసి, చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాదులతోను, గంధపుష్ప అక్షతల. తోను, నానావిధవస్త్రములతోను బూజించి, ధూపదీపంబు లొసఁగి, గోధుమపిండితోఁజేసి నేతిలోఁ గాల్చిన యిరువది యొక్క యతీరసములను, పాయసమును, పాలు, పెరుఁగు,. తేనె మొదలగు వానితో నిండిన సకలవిధ శాకంబు. లను, పలు తెఱఁగులైన యకఁటి మామిడి కిచ్చిలి మొదలగు పండ్లను నివేదననేసి, తాంబూల నీరాజన మంత్రపుష్పములొ సఁగి, కేదారనాథుని బలువిధంబుల స్తోత్రములు సల్పి పూజయైన పిదప బ్రాహ్మణుల కందఱికి భూరిదక్షిణాతాంబూలము లొసఁగి వ్రతంబు పూర్తినేసి యాకేదారేశ్వరుని సంతోష పెట్టుము.. అంతటఁబక మేశుఁడు వేల్పులందరితోఁ గూడ వచ్చి నీకు స్వదేహ ములో నద్ధాంశము నొసఁగునని చెప్పెను. అంతటఁ బాక్వతి మునీంద్రుఁడు చెప్పిన చొప్పున బహు భక్తితో నాకేదారేశ్వర వ్రతంబు నాచరించెను. తర్వాత భగ వంతుఁడగు వృషధ్వజుఁడు వేల్పుగుములతోడఁ బ్రత్యక్షమై- పార్వతికిఁ దనదేహములో సగముభాగము నొసఁగాను, తర్వాత పార్వతి మిక్కిలి సంతోషపడి, యీశ్వరుని యర్ధశరీరమును బొంది, లోకుల మేలుగోరి యీశ్వరుని సంతోషపరచి కేదారేశ్వ కుని యసుగ్రహంబువలనఁ గోరినకోర్కెలెల్ల భక్తుల కొసఁగు నట్లు వరంబుగోరెను. పరమేశ్వరుఁడ్రును అట్లే కలుగును గాక యః యను గ్రహించి, నుగ్రహించి, వేల్పులందరితోఁ గూడి యంతర్ధానము. నొందెను. అప్పు డచ్చటనుండిన శివభక్తుఁడయిన చిత్రాంగదుఁ