140 వ్రతరత్నాకరము
140 వ్రతరత్నాకరము పార్వతీ దేవి నడి గెను. ఆపార్వతి తన విచారంబునకుఁ గారణం బెరింగించి యాతనినిఁ గూర్చుండఁ జేసి "ఓభగవంతుఁడా! -సకలయోగులు పూజించెడి యీశ్వరుని యర్ధాంగము నాకెట్లు సిద్ధించునో, యట్టివ్రత మొక్కటి యానతోమ్మని యడిగెను. అంతట గౌతమమహాముని సకలశాస్త్రములను పురాణములను బరికించి, "కోరిన కోర్కుల నొసఁగు కేదారేశ్వర వ్రతంబు “నాచరింపుము. నీకోరిక సిద్ధించు”నని చెప్పెను. ఆపార్వతి ముని పలుకులు విని, “ఓమహాత్మా! ఆ వ్రతంబు సేయుట యెట్లు? శాస్త్రవిధానంబు నెఱింగింపుము.” అని యడుగఁగా, నా గౌతమ మునీంద్రుఁ డాపార్వతీదేవి కి ట్లనెను. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాఁడు మానవుఁడు పరిశుద్ధుఁడై తెల్ల పట్టుని కాని లేక నూలు పోఁగుని కాని యిరువదియొక్క పేటలనూలిని జేతికి కంకణము కట్టుకొనవలయును. ఆరాత్రి యుపవాసముండి బ్రాహ్మణభోజ నంబు చేయింపవలెను. ఆది మొద లమావాస్య వఱకుఁ బ్రతికిన మును కేదారనాథుని బూజ చేయవలయును. ఆవ్రతంబు సేయువిధం చెట్లనినః ప్రతిదిన ముదయమున లేచి పరిశుద్ధమై విజనమైయుండు స్థలంబున ధాన్యమును రాశి పోసి దానిమీఁద నొక పూర్ణకుంభము నునిచి, దాని నిరు “వదియొక నూలిపోగులతోఁ జుట్టి దానిమీఁద తెల్లని బట్టు బట్టగాని, లేక మజేవస్త్రముసుగాని చుట్టి, నవరత్నములను గాని, బంగారమునుగాని, వెండినిగాని దానియందుంచి, గంధ “పుష్పాక్షతాదులతో నాకలశంబును పూజించి, యావల నిరువది యొక్క మంది బ్రాహ్మణులను బిలిచి, కాళ్లు కడిగి పీఁటలమీఁదఁ గూర్చుండఁ బెట్టి, పురోహితునికి ముందుగాఁ బూజు నేసి, పిమ్మట