Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేదారేశ్వర వ్రతము 139

కేదారేశ్వర వ్రతము 139 దేవిని విడిచి, పరమశివునికి మాత్రము ప్రదక్షిణము గావించి నమస్కరించెను. అప్పుడు పార్వతి తననాథునిఁజూచి "యీభృంగి. రిటి నన్ను వదలిపెట్టి నీకు మాత్రము ప్రదక్షిణంబు గావించినాఁ డందుకేమి కారణం” బని యడుగఁగా శశిశేఖరుఁడును "ఓ ప్రియా! బ్రహ్మము నెఱిఁగిన యోగులు నిన్ను మ్రొక్కరు. వారికి నీవలనఁ బని లేదు. అని పార్వతికిఁ జెప్పెను. బోయి. ఇట్లు పరమశివుఁడు చెప్పఁగాః బార్వతీ తన ప్రియుని మీఁదె కోపముచే నతనిని బాసి తనశ క్తి నాకరింపఁగా, పర మేశ్వరుఁడును ప్రియావియోగముచే జిక్కి పోయెను, అంబికయు సీయవియోగముచే మిక్కిలి చిక్కి, దేవతలు వేడు కొనుచున్నను, శాంతినొందక కైలాసము విడిచి, యొండొంటి, మీఁద పగలేని' సింహవ్యాఘ్రమృగంబులతోఁ గూడినదియు, మహర్షుల కునికిపట్టును, జనులకందఱకుఁ బ్రీతికరమై యన్ని కోర్కుల నొసఁగునదియు నైన గౌతమవనంబునకుఁ నేరెను. ఎక్కువ బ్రహ్మతేజస్సుగల గౌతమమహాముని వనంబునఁ బెరుగు హోమయోగ్యము లగుసమిధలను, దర్భలను బండ్లను గైకొనివచ్చుటకై వనాంతరములకుఁ బోయియుండెను. తర్వాత నమ్మహర్షి కావలసిన వస్తువులను గైకొని మరలి, తన యాశ్రమము చేరువకు వచ్చి, “ఏమి యీవింత? ఈతపస్సుల యా శ్రీ మంబు ఆకాలమున మిక్కిలి శోభిల్లుచున్నది. కారణ మేమైయుండవచ్చును” అని యాలోచించుచు, తపో వనంబులోపలఁ బ్రవేశించి, కమలంబులంబోలు కన్నులుగల పార్వతిం జూచి యతిథిపూజ సేసి యాగమన కారణం బేమని