Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

వ్రతకర్నాకరము

116 కరించి వ్రతరత్నాకరము ఆమంటపమున ముగ్గులు పెట్టి యామంటడమునడుమ దివ్యమైన యాసనంబు నమర్చి దాని మీఁద బియ్యము పోసి, పూవు లత. తలుచల్లి, శక్తివంచన లేకుండ బంగారుతోఁగాని, వెండితోఁగాని, రాగితోగాని తుదకు మంటితో గాని ఆదిశేషుని ప్రతిమ నొకదానిని జేయించి దానిమీఁదఁ బెట్టి యా ప్రతిమ యందు గౌరీదేవి నావాహనము చేసి, అసనాఘ్యపాద్యాచమ నీయస్నాన వస్త్ర యజ్ఞోపవీత గంధపుష్పాక్షతాభరణాలంకార ధూపదీపనై వేద్య తాంబూల నీరాజన మంత్రపుష్పాదు లగు సకలపూజలను గావించి, ప్రదక్షిణ నమస్కారములు సల్పి, దోర పూజనేసి దోరము గట్టుకొని వృద్ధ బ్రాహ్మణునికి వాయనం బొసఁగి సకల బ్రాహ్మణులకు సంతర్పణంబు గావించి, తాను తన యిష్ట బంధుజన సమేతముగా భుజియించి, వ్రతమును పూర్తి చేయవలెను. ఏసుదతి యీ వ్రతంబును బది సంవత్సరములు విడువక చేయుచున్నదో ఆసుమంగలి యిహలోకంబున సెకల సౌఖ్యంబుల ననుభవించి, యంతమున మోక్షసామ్రాజ్యము నొండఁగలదు”అని సూతమహాముని చెప్పఁగా, శౌనకాదిమునీం ద్రులు వెండియు నమ్మనీంద్రుని. నీఁ జూచి, "ఓ మునీంద్రా! మేము గరుత్మంతుని జననము, కార్యములు, వీర్యమునుగూర్చి వినఁ గోరుచున్నాము. నేల వి”మ్మని యడుగఁగా, సూతపౌరాణి కుఁడు ఆగరుడుని జననాదులనుగూర్చి వారి కిత్తెఱఁగున నెఱిఁ గించె. “ఓమునులారా! తొల్లి బ్రహ్మపుత్రుఁడయిన కాశ్యపుడ డనెడి పేరుగల యొకమహర్షి యుండెను. ఆయనకు సుపర్ణియను భార్య యొక్కతె యుండెను. ఆయన కాసుపర్ణియండు గరప త్మంతుఁ డనెడియొక కొమరుఁడు పుట్టెను. ఆతఁడు మితిమీఱిన al