పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్రతరత్నాకరము

నేనుపాపుఁడను. పాపపుఁబనులు చేయువాఁడను. పాపపు బుట్టుక' గలవాఁడను. శరణుచొచ్చిన వారిని కాపాడునట్టి యోపుండరీ కామోండా! నన్ను రక్షింపుము. ఈదినమున నాజన్మము సార్థక మయ్యెను. కావుననే నామనస్సు నీపాదములందు కమలమందు తుమైన చేరియున్నట్లు చేరియున్నది. ఓ దేవా! నేనిఁక మిమైన్నటి కిని మరువను.” అని యివ్విధంబున భగవంతుని స్తోత్రము చేయఁగా, భగవంతుఁడు సంతుష్టుఁడై యా బ్రాహ్మణునికి ఇహ లోకమున సంపదను, ధర్మబుద్ధిని, పరమున శాశ్వతమైన మోక్ష మును అను ఈమూఁడువరంబుల నొసఁగెను. ఆ బ్రాహ్మణుఁడు తానావరంబులను బొంది, “యోమహాత్మా! నేను దారిలో చూచిన మామిడిచెట్టేమిటిది? యాఆవు ఏది? ఆయె దేవీ? ఆకొలఁకు లేవి? ఆగాడిదఏది? ఆయేనుఁ గేది? ఆముసలి బ్రాహ్మణుఁ డెవ్వఁడు? ఓకేళవా! వాని సంగతియేమి చెప్పు:”డని యడిగెను.

"ఓ బ్రాహ్మణా! పూర్వజన్మమున ఒక బ్రాహ్మణుఁడు గొప్ప విద్వాంసుఁడయ్యు శిష్యులకు విద్య చెప్పక గర్వించియుండెను. గనుక, ఆతఁడడవిలో నెవరికి సుపయోగపడని యట్టి మామిడి చెట్టుగాఁ బుట్టినాఁడు. జన్మాంతరమున నొకధనికుఁడు విపులకు ఎన్నఁడుమర్యాద నేసియన్నము పెట్టినవాఁడు గాఁడుగసుక, గడ్డిలో నిలుచున్నను ఆగడ్డిని తినుటకు నో కాడని యొక ఆవుగాఁ బుట్టి నాఁడు. తొల్లి చవిటి చేనిని బ్రాహ్మణులకు దానము చేసినయొక రాజు వృషభమైపుట్టి తిరుగుచున్నాడు. ఆకొలఁకులు రెండును ధర్మాధర్తములు, పరనింద చేసినవాఁ డాగాడిద. పెద్దలుంచిన ధర్మపు సొత్తును అమ్మినవాఁ డాయేనుగు. నీకుఁ బడుగుగాఁ గనబడిన బ్రాహ్మణుఁడు అనంతపద్మనాభస్వామినైననేనే. ఓద్విజోత్తమా! నీ ప్రశ్నల కెల్ల నుత్తరమిచ్చితిని. నీవును ఈ వ్రతంబును పదునాలు