వెలుగోటివారి వంశావళి
133
పట్టాధీశులు నొచ్చి వచ్చినను జేపట్టన్ విరోధించి యి ట్ట ట్ట న్నంతనె మట్టుపెట్ట నసహాయంబైన శౌర్యస్థితిన్ బట్టౌ యా[1]వెలుగోటి యేచవిభుకుం బట్టైనరంగప్పఁ డో బట్టా వానిప్రతిజ్ఞ లే దనఁడు రా ప్రత్యర్థికి న్నర్థికిన్[2].
అరుదౌ నీబిరుదప్రబంధములు[3] గల్యాణాద్రిపై యక్ష[4]కి న్నరగంధర్వసతుల్ సదాశ్రుతిఫుటానందంబుగాఁ బాడఁగా నర రే! బాపు! భళీ! సెబా! సహహ! యౌరా! మే లహో! యందురా హరిదీశుల్[5] వెలుగోటియేచవిభురంగా సంగరక్ష్మార్జునా.
కిల్లాకు నంపితే డిల్లీకటకగౌళ మేదినీశులనామజాదు[6] వచ్చు నీలిపోఁ గంపితే[7] నేపాలమండువా పండువాసృపతులపంపు వచ్చు ముఖవార్తఁ బంపితే[8] ములువాయకోలాల మలయాలభూములమంది వచ్చుఁ జీటిఁ బెట్టంపితే సింధుకేరళచోళ[9] పాండ్యరాజుల యంగబలము వచ్చు దముకు వేయించితే దిగంతముల[10] నున్న రాయమన్నీలు వత్తురు కూయి బడిగ భూవిభునిమాత్రుఁడే మనుష్యావతార రంగవిభుఁ డుర్వి వెలుగోటిరంగవిభుఁడు.