128
వెలుగోటివారి వంశావళి
నీటున్ బోటు మెలంచు[1] శూరులకు గుండెల్ వ్రక్కలై తూలు నీ ధాటీతమ్మటధంధణంధణల నుద్భాసించు నీతో నిరా ఘాటాహంకృతిఁ[2] బోర నొక్కనికి శక్యంబా రణాభీలబా హాటోపాధిప వేంకటప్రభునిరాయా వీరకంఠీరవా.
అతిగాఢపరిరంభణాసక్తిఁ గదిసినఁ గౌఁగిటి కెద[3]యీఁడు కమఠభర్త గోరి చుంబించఁ బైకొన[4] మోవిపైఁ గేలు దిగువఁ[5]జాలకయుండు దిగ్గజములు మనసు రంజిల్ల పాదపద్మంబు లొత్తఁ జూడంగనీఁ డురగవిభుఁడు[6] పలుకుసందడిఁ బల్కుఁ బల్కించుకొన నోడు సరసనర్మోక్తుల శైలరాజు సమరసులుగాని యీమూఢతములపాలఁ బడఁగ నేమిటి కని ధరాప్రౌఢకాంత వలచి వచ్చిన బహుకళావైభవములఁ బ్రౌఢిఁ బాలించు రాయభూపాలమాళి.
హితమతి నారాయమహీ పతిరత్నము రాగమాంబఁ బరిణయ మయ్యెన్ రతిదేవిఁ బంచబాణుఁడు నతులశ్రీలక్ష్మి నంబుజాక్షుఁడు వోలెన్.